పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం
పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నాన్ని బీఎస్ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి. ఫిరోజ్పూర్ సెక్టార్లో డ్రగ్స్ప్యాకెట్లను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అర్థరాత్రి సేతావాల గ్రామంలో డ్రగ్స్ ప్యాకెట్లను జారవిడిచిన డ్రోన్. 3 హెరాయిన్ ప్యాకెట్లు, 2 మెరిసే బంతులు, బ్యాటరీతో కూడిన నీలిరంగు ఎల్ఈడీ బల్బును స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ దళాలు. 3 హెరాయిన్ ప్యాకెట్ల బరువు రెండున్నర కిలోలుగా గుర్తించారు.