నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం

నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం

ముద్ర,తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో యాదవులకు ప్రభుత్వం అందించిన 1175 మేకలు, గొర్రెలకు నట్టల నివారణకు మందులు వేశారు. జిల్లాలోని యాదవ సోదరులందరు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ గొర్రెలకు, మేకలకు నట్టల నివారణకు మందులు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగేల మానస, సర్పంచ్ నకిర్తి బాలమల్లు, ఎంపీటీసీ గుగ్గిళ్ళ లావణ్య, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు మిరాల భాస్కర్ యాదవ్, గుగ్గిళ్ల అంజయ్య, పడిగల రాజు, బండి దేవేందర్ యాదవ్, తిరుపతి, పరశురాములు, పశువైద్యాధికారి సిహెచ్ సంతోష్ కుమార్, పశు వైద్య సిబ్బంది కరుణ శ్రీ, సంతోష్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.