కాంగ్రెస్ లో చేరిన అయోధ్య బీఆర్ఎస్ ఎంపిటీసీ.. ముదిరాజ్ సంఘ నాయకులు

కాంగ్రెస్ లో చేరిన అయోధ్య బీఆర్ఎస్ ఎంపిటీసీ.. ముదిరాజ్ సంఘ నాయకులు

ముద్ర, రాయికల్ : రాయికల్ మండలం అయోధ్య బీఆర్ఎస్ ఎంపీటీసీ రానవేని రవీంధర్, 50 మంది ముదిరాజ్ సంఘ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో  సోమవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో  కాంగ్రెస్ పార్టీ లో చేరగా, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ముదిరాజ్ సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పై జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రానవేని రవీంధర్ తో పాటు, ముదిరాజ్ నాయకులు, రాయికల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవీంధర్ రావు పాల్గొన్నారు.