జలమండలి ఎదుట బీజేపీ కార్పొరేటర్లు మెరుపు ధర్నా
హైదరాబాద్లోని జలమండలి ఎదుట బీజేపీ కార్పొరేటర్లు మెరుపు ధర్నా చేశారు. జలమండలి ఆఫీసు ముందు చెత్త వేసి నిరసన వ్యక్తం చేశారు. నాలాల పూడిక తీతలో వాటర్ వర్క్స్ విఫలమైందని ఆరోపించారు. కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదం జరిగింది. ఆఫీసులోకి వెళ్లడానికి బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు బయటకు ఈడ్చుకెళ్ళారు.