అభివృద్ధిని చూసి ఆదరించండి
![అభివృద్ధిని చూసి ఆదరించండి](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_654089dfd955f.jpg)
- సూర్యాపేట లోని 16 వ వార్డ్ లో మంత్రి సతీమణి సునిత జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం
- బ్రహ్మరథం పడుతున్న పట్టణ వాసులు
ముద్ర ప్రతినిధి సూర్యాపేట: రాష్ట్రంలో సీఎం కేసీఆర్, సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, బీఆర్ఎస్ను ఆదరించాలని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్ధి గుంటకండ జగదీశ్ రెడ్డి సతీమణి సునీత జగదీష్ రెడ్డి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత జగదీష్ రెడ్డి కీ ప్రజలు ఘనస్వాగతం పలికి శాలువా లతో సన్మానించి మేమున్నామని భరోసా ఇచ్చారు. వార్డ్ లోని ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పిస్తామని, భూమి ఉన్న వాళ్లకు రైతుబీమా, భూమి లేని వాళ్లకు కేసీఆర్ బీమా వర్తింపజేస్తామని చెప్పారు. ఆసరా పింఛన్లు పెంచుతామని, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు అందించేందుకు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను రూపొందించారని తెలిపారు. ప్రతి వార్డ్,గ్రామంలో మహిళా సంఘాలకు సొంత భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని పట్టణ ప్రజలు గుర్తించాలని కోరారు. మూసి మురికి నీటి నుండి పట్టణంలో ప్రజలకు విముక్తి కల్పించిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డి దే అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డికి అండగా ఉండి సూర్యాపేట అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగినేని ఉపేందర్ రావ్ కాసం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు