దండు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

దండు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన నిమ్మికల్లు శ్రీ దండు మైసమ్మ తల్లి ఆలయం పునర్నిర్మాణం పనులను   రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి  శుక్రవారం ప్రారంభించారు. ఆలయంలో అమ్మ వారి విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.