రామగుండం- మణుగూరు రైల్వే కోల్ కారిడార్ కు కేంద్రం పచ్చజెండా...
![రామగుండం- మణుగూరు రైల్వే కోల్ కారిడార్ కు కేంద్రం పచ్చజెండా...](https://mudranews.in/uploads/images/2024/05/image_750x_664ee57e25446.jpg)
ముద్ర,తెలంగాణ:-రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందు కోసం భూ సేకరణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2, 911 కోట్ల రూపాయలుగా ఉంది.ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణంతో దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గబోతుంది. పెద్దపల్లి–మణుగూరు రైల్వే లైన్ 207 కిలో మీటర్ల పరిధిలో సింగరేణి కోల్ బెల్ట్లను కలుపుతూ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు.