రూ.425 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్ తీరంలో ఇరాన్ పడవ కలకలం సృష్టించింది. భారత్ తీరంలో ఇరానీ బోటు కనిపించడం చర్చనీయాంశం అయింది. ఈ బోట్ను ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. సోదాలు చేయగా రూ.425 కోట్ల విలువైన 61 కిలోల మాదకద్రవ్యాలతో పాటు ఐదుగురు సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. ఏటీఎస్ గుజరాత్, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ సహకారంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ రూ. 425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్ను తీసుకెళ్తున్న ఇరాన్ బోటును పట్టుకున్నారు. ఈ బోటులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. పడవలోని సిబ్బందితో పాటు, పడవను కూడా అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.