వారి కుటుంబాలకి రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా...ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వికాస్ రాజ్
![వారి కుటుంబాలకి రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా...ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వికాస్ రాజ్](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_6672a47ca14f0.jpg)
ముద్ర,సెంట్రల్ డెస్క్:-తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో విధుల్లో ఉండగా 13 మంది ఉద్యోగులు మరణించారు.. తాజాగా మరణించిన వారి కుటుంబాలకు ఈసీ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. రాష్ట్రంలోని 13 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఈసీ ఎక్స్ గ్రేషియాను రిలీజ్ చేసింది. మొత్తం రూ.1.95 కోట్లను విడుదల చేస్తూ సీఈవో వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.