ఉరి వేసుకుని కౌలు రైతు మృతి

ఉరి వేసుకుని కౌలు రైతు మృతి

ముద్ర, జమ్మికుంట:-జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురై యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం విలాసాగర్ గ్రామానికి చెందిన యువకుడు గంటి రాజు (34) కూలి పని చేసుకుంటూ ఎకరం భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. పంట పెట్టుబడి కోసమని 2 లక్షల రూపాయలు అప్పు చేశాడు. పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో మనస్థాపం చెంది భార్య రజిత రాఖీ కట్టడం కోసం పుట్టింటికి వెళ్ళిన సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. మృతుడికి భార్య రజిత, కుమారులు ఉన్నారు.