వెల్గటూర్ లో ఆంజనేయ స్వామి  ఆలయంలో చోరీ...  

వెల్గటూర్ లో ఆంజనేయ స్వామి  ఆలయంలో చోరీ...  

వెల్గటూర్, ముద్ర :  జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండల కేంద్రంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో  శనివారం  అర్ధరాత్రి చోరీ జరిగింది. కాగా ఆలయంలో గల రెండు ఉండీలను దొంగలు పగలగొట్టి, అందులో గల నగదును ఎత్తుకు వెల్లారు. కాగా అందులో దాదాపు రూ.6 వేల వరకు నగదు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.  ఆలయ అర్చకుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ధర్మపురి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో  వారం రోజులుగా జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులు గ్రామాలలో వారి నిఘాను  పెంచాలని కోరుతున్నారు.