భూపాలపల్లిలో రూ.2 కోట్లతో గిరిజన భవన నిర్మాణానికి శంకస్థాపన..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కృష్ణకాలనీలో రూ. 2 కోట్ల నిధులతో గిరిజన భవన నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ల చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిజనులతో కలిసి వారు డ్యాన్సులు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.