ఒలంపియాడ్ లో సిద్ధార్థ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

ఒలంపియాడ్ లో సిద్ధార్థ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఇండియన్ టాలెంట్ ఒలంపియాడ్ లో సిద్ధార్థ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని సిద్ధార్థ హై స్కూల్స్ అకాడమిక్ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక భగత్ నగర్ సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న కే అర్జున్ రాష్ట్రస్థాయిలో టాపర్ గా నిలిచి బంగారు పతకం తో పాటు నగదు పారితోషికాన్ని కైవసం చేసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఏడవ తరగతి చదువుతున్న ఎం సాన్వి, ఎనిమిదవ తరగతి చదువుతున్న సాయిచరణ్ లు రాష్ట్రస్థాయిలో ఎక్సలెన్స్ మెడల్స్ అవార్డు తో పాటు బంగారు పథకాలు, ప్రశంస పత్రాలను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా విధానంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నామని వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విద్యార్థులను అత్యున్నత స్థాయిలో నిలపడమే లక్ష్యంగా విద్యా బోధన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మారుతున్న విద్యావిధానాన్ని అధిగమిస్తూ పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉత్తమ బోధన అందించిన అధ్యాపకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.