రెండవ ఎ.ఎన్.యం లను రెగ్యులర్ చేయాలని  కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

రెండవ ఎ.ఎన్.యం లను రెగ్యులర్ చేయాలని  కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విడుదల చేసిన ఎ.ఎన్.యం.లను నోటిఫికేషన్ రద్దు చేసి ఎటువంటి పరీక్షలు లేకుండా రెండవ ఎ.ఎన్.యం. లను వెంటనే రెగ్యులర్చేయాలని కోరుతూ తెలంగాణ ఉమెన్ ఎ.ఎన్.ఎం వెల్ఫేర్ అసోషియేషన్ అధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా అసోషియేషన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని  ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారని,  మా ఆశలు నెరవేరలేదన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాలలో - 1వ ఎ.ఎన్.ఎం.కి సమానంగా విధులు నిర్వర్తిస్తున్న మమ్మల్ని కాంట్రాక్టు, ఎన్.హెచ్.యం, ఉద్యోగులు అని చిన్న చూపు చూస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండియే దాదాపు 20 సంవత్సరముల సుదీర్ఘకాలము నుండి ఎంపిహెచ్ ఎ (ఈ)లకు సమానంగా విధులు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నమన్నారు. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేకున్నా ఏదో ఒక రోజు రెగ్యులర్ చేస్తారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నామన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మా కుటుంబాలకు దూరంగా ఉంటూ, వ్యాధిగ్రస్తులకు దగ్గర ఉన్న సమయంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన  మేము ప్రాణాలు లెక్క చేయకుండా ప్రతి నిత్యం అందుబాటులో ఉండి సేవలందిచామని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రెండవ ఎ.ఎన్.యం.లను  ఎటువంటి పరీక్షలు లేకుండా  వెంటనే రెగ్యులర్చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గాండ్ల మధురిమ, సాదుల వసంత, పడాల మమత, వంగల నీరజ, నేరాల్ల శోభరాణి తదితరులు పాల్గొన్నారు.