వారం రోజుల్లో గొల్లపల్లి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

వారం రోజుల్లో గొల్లపల్లి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : వారం రోజుల్లో గొల్లపల్లి రోడ్డు విస్తరణ పనులు ప్రారంబిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో బస్ డిపో వద్ద రూ. 11 కోట్ల 15 లక్షలతో జిల్లా మెడికల్ కాలేజీ చుట్టూ రహదారుల అభివృద్దిలో భాగంగా  చిన్న కెనాల్ నుండి రామాలయం, బస్ డిపో, మాతా శిశు సంరక్షణ కేంద్రం, నటరాజ్ చౌరస్తా, బసవేశ్వర విగ్రహం వరకు బిటి రోడ్డు, నూతన కలెక్టరేట నుండి అంతర్గాం రోడ్డు వరకు 4 లైన్ల బిటి రోడ్డు అభివృద్ది పనులకు జిల్లా లైబ్రరీ చైర్మన్ డా. చంద్ర శేకర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఉపయోగపడుతుందని, ప్రజలకు రవాణా, వసతుల దృష్ట్యా అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయటం జరిగిందన్నారు. 4నెలల్లో పనులు మొత్తం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నేటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చుట్టూ పక్కల జిల్లాల నుండి సైతం ప్రజలు వస్తున్నారు. కావాలని కొందరు నాయకులు తప్పుడు ప్రచారం తో మెడికల్ కాలేజీకి అడ్డం పడ్డా నేడు ప్రజల ఆకాంక్ష మేరకు నడి బొడ్డున ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ లు వొద్ధి శ్రీలత, జుంబర్థి రాజ్ కుమార్, కేడిసిసి జిల్లా సభ్యుడు రామ్ చందర్ రావు, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.