మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి - బీజేపి నాయకుల డిమాండ్

మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి - బీజేపి నాయకుల డిమాండ్

మెట్‌పల్లి ముద్ర:- మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు దీక్ష చేపట్టిన మధ్యాహ్న భోజన కార్మికులకు ఆయన బిజెపి పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తమ స్వంత డబ్బులతో అందిస్తున్న కార్మికులకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తేనే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని.మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేయడంతో విద్యార్థుల కు మధ్యాహ్న భోజనం అందడం లేదని. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులతోపాటు ప్రభుత్వ జీవో నెంబర్ 8/ 2023 ప్రకారం పెంచిన బిల్లులను చెల్లించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ అధ్యక్షురాలు కూన సరస్వతి, జిట్టవేని లక్ష్మి, సులోచన, సాలమ్మ, లక్ష్మీ, గంగు, పోసాని, మల్లు, భారత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్  పార్లమెంటు కో కన్వీనర్ గుంటుక సదాశివం, కోరుట్ల నియోజకవర్గ నాయకురాలు జేఎన్ సునీత బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనికెల నవీన్,  కొల్లెపు శ్రీనివాస్,మద్దెల లావణ్య,  యాదగిరి బాబు, జుంగుల అనిల్, కలికోట శ్రీకాంత్,  సుంకే అశోక్,అవినాష్,జెట్టి రూపేష్ ఎంపీటీసీ శివ కుమార్,సునంద తదితరులు పాల్గొన్నారు.