అర్హులైన దళితులను ఆదుకోవాలి - బీజేపీ దళిత మోర్చా డిమాండ్

అర్హులైన దళితులను ఆదుకోవాలి  - బీజేపీ దళిత మోర్చా డిమాండ్


ముద్ర, మల్యాల:అర్హులైన దళితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బీజేపీ దళిత మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మల్యాల బ్లాక్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహంకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ డప్పులు కొట్టే, చెప్పులు కుట్టే వారికి 5 వేల పింఛన్ ఇవ్వడంతొ పాటు, అర్హులైన వారికి దళితబందు, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోర్చా మండల అధ్యక్షుడు కొత్తూరి సందీప్, ఎంపీటీసీ సంగాని రవి, వంశీ, రమణ, తడగొండ రాజు, నీలం రవి, గుండేటి గంగారాం, శేఖర్, అక్షయ్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.