లింక్ తెగి రెండుగా విడిపోయిన గూడ్స్ రైలు!

లింక్ తెగి రెండుగా విడిపోయిన గూడ్స్ రైలు!

కేసముద్రం, ముద్ర: డోర్నకల్ - కాజీపేట రైల్వే మార్గంలో కేసముద్రం ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం లింకు తెగిపోయి గూడ్స్ రైలు రెండుగా విడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన గూడ్స్ రైలు గార్డు వాకీటాకీ ద్వారా డ్రైవర్ ను అప్రమత్తం చేయడంతో వెంటనే డ్రైవర్ రైలు నిలిపి తిరిగి వెనక్కి తీసుకువచ్చి తెగిన లింకును మళ్ళీ జాయింట్ చేసి యదావిధిగా గూడ్స్ రైలు ను తీసుకెళ్లాడు. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైనవని రైల్వే వర్గాలు వివరించాయి.