ఘనంగా భూలక్ష్మి మహాలక్ష్మి దశమ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా భూలక్ష్మి మహాలక్ష్మి దశమ వార్షికోత్సవ వేడుకలు

చిట్యాల ఏప్రిల్ 21 ముద్ర న్యూస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం నైన్ పాక, గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి ప్రతిష్టించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున భూలక్ష్మి మా లక్ష్మి దశమ వార్షికోత్సవ వేడుకలను గ్రామ సర్పంచ్ తొట్ల లక్ష్మి ఐలయ్య శ్రీ రామకృష్ణ పరమహంస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రజలందరూ సుఖశాంతులతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, ఉండాలని  పెండ్యాల ప్రభాకర చారి, మిన్నాపురం రమేష్ చారి, వేద పండితులతో గణపతి పుణ్య వాచన హోమం కుంకుమ పూజ అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ హోమం పూజలో గ్రామంలోని 40 మంది జంటలు పూజలో పాల్గొని హోమం కాల్చారు. గ్రామంలోని మహిళలందరూ కుంకుమ పూజలో పాల్గొని పూజలు జరిపించారు ఈ కార్యక్రమంలో మారెళ్ళ రఘుపతి రెడ్డి, నందికొండ రాఘవరెడ్డి, నందికొండ దేవేందర్ రెడ్డి, చిన్నల శ్రీనివాస్, కైరిక కిషన్ రావు, చిన్నల రమేష్, బావు గట్టయ్య, మారెళ్ళ దేవేందర్ రెడ్డి, నూక వీరన్న, నూకరాజు, భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు