భారతదేశం ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి - ప్రధాని మోదీ
![భారతదేశం ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి - ప్రధాని మోదీ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646c8d1d5bde5.jpg)
భారతదేశం ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆయన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రపంచాన్ని తాము ఒక కుటుంబంగా చూస్తామన్నారు. వసుధైక కుటుంబం అన్నది తమ నినాదమని అన్నారు. వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అన్నది తమ విధానమన్నారు. వన్ ఎర్త్, వన్ హెల్త్ అని అన్నారు. కరోనా కష్టకాలంలో 150 దేశాలకు భారత్ వ్యాక్సిన్లు పంపించిందన్నారు.
100 కు పైగా దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రాణాలు భారత్ కాపాడిందని మోదీ అన్నారు. నైపుణ్యానికి భారత్లో కొదువ లేదన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని చెప్పారు. పాల ఉత్పత్తిలో దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. ఇంటర్నెట్ వినియోగంలో రెండో స్థానంలో ఉందన్నారు. భారత్లో బ్యాకింగ్ వ్యవస్థ బలంగా ఉందన్నారు.
దేశంలో విదేశీమారక ద్రవ్యం భారీగా ఉందని చెప్పారు. మూడు రోజుల పర్యటన కోసం మోదీ ఆస్ట్రేలియా వచ్చారు. భారత్ గొప్పదన్నాన్ని ప్రవాసులకు వివరించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు.