పాత ఆటో నగర్ లో ఉన్న షాప్ ఓనర్లకు మాత్రమే అర్హులు 

పాత ఆటో నగర్ లో ఉన్న షాప్ ఓనర్లకు మాత్రమే అర్హులు 

ముద్ర ప్రతి నిధి,  సిద్ధిపేట : రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా 50 కోట్ల రూపాయల విలువైన 25 ఎకరాల స్థలంలో 15 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో చేపడుతున్న సిద్దిపేట ఇండస్ట్రియల్ పార్క్ లో మోడల్ ఆటోనగర్ లో నిర్మాణం తుది దశకు చేరుకుంది. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని ఛాంబర్ లో ఆటో నగర్ యూనియన్ నాయకులతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ..
పాత ఆటో నగర్ లో ఉన్న షాప్ ఓనర్లకు మాత్రమే అర్హులని తెలిపారు. టీఎస్ఐఐసి సంస్థ వారు పరిశ్రమలకు లీజ్ పద్దతిలో అందజేస్తారని ట్రేడ్ లైసెన్స్, పోటో కాపితో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సకల సౌకర్యాలతో అత్యంత అధునాతన పద్దతిలో తీర్చిదిద్దుతున్నందున ఇట్టి ప్లాట్లకు డెవలప్ మెంట్ రుసుమును మాత్రమే చెల్లించి యజమానులు పేరిట రిజిస్ట్రేషన్ చెసుకోవాలన్నారు. ఎమైన సమస్యలు ఉంటే మంత్రి హరీష్ రావు సమక్షంలో చర్చించి అందరికీ న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకుంటామని  హమి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసి నుండి జ్యోతి, రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యులు పాల సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.