తెలంగాణలో కర్ణాటక ఎన్నికల హడావుడి

తెలంగాణలో కర్ణాటక ఎన్నికల హడావుడి

బుధవారం  కర్ణాటక ఎన్నికల  షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక కర్ణాటక ఎన్నికల హడావుడి తెలంగాణలో సైతం ప్రారంభమైంది.  నెక్ట్స్ టార్గెట్ తెలంగాణయే కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ  అధిష్టానం ఫోకస్ చేసింది. కర్ణాటకలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. కర్ణాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ ఈజీగా గెలుస్తామని బీజేపీ చెబుతోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు.  పాత హైదరాబాద్ సంస్థానం.. ప్రస్తుత కర్ణాటకలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డీకే అరుణ , లక్ష్మణ్  తదితరులున్నారు. బీదర్‌లో జరిగిన అమిత్ షా సభలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావటంతో కర్ణాటకలో ప్రచారానికి మరికొంత తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణపై బీజేపీ అగ్రనేతలు మోదీ , అమిత్ షా, జేపీ నడ్డా లు ప్రత్యేక దృష్టి సారించారు.