దివంగత తహాసిల్దార్ కు మండల సభ ఘన నివాళి

దివంగత తహాసిల్దార్ కు మండల సభ ఘన నివాళి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తహాసిల్దారుగా విధులు నిర్వహిస్తూ కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన ఫరీదుద్దీన్ మృతి పట్ల కేసముద్రం మండల సర్వసభ్య సమావేశం ఘనంగా నివాళి అర్పించింది. ఎంపీపీ ఓలం చంద్రమోహన్ అధ్యక్షతన బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు దివంగత తహసిల్దార్ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఫరీదొద్దీన్ చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఎంపీపీ, జడ్పిటిసి చంద్రమోహన్, శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలోనే తహసిల్దార్ ఫరిదోద్దీన్ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించారని కొనియాడారు.