2కే రన్ ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్

2కే రన్ ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు పోలీస్ శాఖ  ఆధ్వర్యంలో సోమవారం 2కే రన్ నిర్వహించారు.  స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ రన్ ను రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఐక్యతకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ చల్లా ప్రవీణ్ కుమార్, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు,జిల్లా పోలీసులు, ప్రజా సంఘాలు, యువకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. మినీ స్టేడియం నుండి శివాజీ చౌక్ మీదుగా తిరిగి స్టేడియంకు చేరటంతో తెలంగాణా రన్ కార్యక్రమము విజయవంతం ముగిసింది.