త్యాగానికి ప్రతీక బక్రీద్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

త్యాగానికి ప్రతీక బక్రీద్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర ప్రతినిధి,మహబూబ్ నగర్: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు స్థానిక కొత్త గంజి సమీపంలో ఉన్న ఈద్గా వద్ద   ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ముస్లిం సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాలకు ప్రతీకగా బక్రీద్‌ నిలుస్తుందని, మనకు కలిగిన ప్రయోజనాలను జనులందరికీ సమానంగా అందించినపుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని మంత్రి తెలిపారు. బక్రీద్ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు. అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా  ఆకాంక్షించారు. 

ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఎస్పీ కె నరసింహ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, డీఎస్పీ మహేష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.