ఎక్సైజ్ దాడుల్లో నాటుసారా, నల్లబెల్లం, ద్విచక్ర వాహనం వాహనం స్వాధీనం

ఎక్సైజ్ దాడుల్లో నాటుసారా, నల్లబెల్లం, ద్విచక్ర వాహనం వాహనం స్వాధీనం

హుజూర్ నగర్ టౌన్ ముద్ర: హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం జరిపిన దాడుల్లో గరిడేపల్లి మండలం మంగాపురం, కపూర్వ తండా, లచ్చతండా, కీత వారి గూడెం గ్రామాల్లో  సారా కాస్తున్న బట్టీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ధరావత్ విజయ, వాంకుడోత్ గోపీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి (30) లీటర్ల నాటు సారా, (1600) లీటర్ల నల్లబెల్లం పానకం, TVS XL ని స్వాధీనం చేసుకుని, వారిని హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించినట్లు హుజూర్నగర్ ఎక్సైజ్ సీఐ ఎన్. నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐలు వెంకన్న, జగన్, సిబ్బంది నాగరాజు, నాగమణి,నాగయ్య పాల్గొన్నారు.