దుబ్బాకకు నిధులకై మంత్రిని కలిసిన ఎంపీ
![దుబ్బాకకు నిధులకై మంత్రిని కలిసిన ఎంపీ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646212c524b7b.jpg)
సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణానికి రూ. 15 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. సోమవారం రోజున హైదరాబాదులోని సెక్రటేరియట్ లోనీ మంత్రి చాంబర్లో రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.