ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే మహాభాగ్యం

హుజూర్నగర్ ,ముద్ర: ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే మహాభాగ్యం అని మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి అన్నారు. బుధవారం పట్టణంలోని 26 వా వార్డులో జరుగుతున్న  పారిశుధ్య పనులను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో పురపాలక సంఘ పరిధిలోని అన్ని వార్డు లలో ఉన్న డ్రైనేజీ మొత్తం పూడిక తీసి రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సేకరించిన బట్టలను ,బొమ్మలను వార్డులో నివసిస్తున్న పేదలకు పంచి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ ఎం అశోక్ ఈ ఈ రాజశేఖర్, జవాన్లు, మెప్మా ,స్టాప్ సాయి కృష్ణ ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.