సీనియర్ జడ్జితో విచారణ.. రైలు ప్రమాదంపై సుప్రీంలో పిల్
![సీనియర్ జడ్జితో విచారణ.. రైలు ప్రమాదంపై సుప్రీంలో పిల్](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647d8bc27ef4a.jpg)
న్యూఢిల్లీ: ఒడిశా బాలేశ్వర్లో చోటుచేసుకున్న రైలు ప్రమాదాలపై సుప్రీంకోర్టు రిటైర్డ్జడ్జిచేత విచారణ జరపాలని పిటిషన్ దాఖలైంది. జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ కమిటీని నియమించాలని సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ తివారీ పిల్లో విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీ రెండు నెలల్లో తమ నివేదికను సమర్పించేలా చూడాలన్నారు. ఈ కమిటీలో సాంకేతిక అంశాలకు సంబంధించిన నిపుణులను కూడా నియమించాలని విశాల్కోర్టును కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై కూడా ఈ కమిటీ సలహాలు, సూచనలు ఇవ్వాలని పిల్లో పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికుల సురక్షితం కోసం ‘కవచ్’ సిస్టమ్దేశవ్యాప్తంగా ఏర్పాటుకు కూడా ఈ కమిటీ ఓ నిర్ణీత సమయాన్ని విధించాలని, రైల్వే ప్రయాణాలపై ఓ గైడ్లైన్ను జారీ చేయాలని విశాల్ తివారీ తాను దాఖలు చేసిన పిల్లో కోరారు.