రామోజీరావు ఆస్తులు అటాచ్​

రామోజీరావు ఆస్తులు అటాచ్​
  • మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ నిర్ణయం
  • రూ.793 కోట్ల విలువైన ప్రాపర్టీని అటాచ్ చేసిన అధికారులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మార్గదర్శి వ్యవహారాల కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకున్నది. చాలాకాలంగా మార్గదర్శికి సంబంధించిన వ్యవహారాల్లో పొరపాట్లు జరిగాయని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రామోజీరావుపై కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో స్పీడ్ పెంచిన సీఐడీ.. ఇటీవల రామోజీరావును ఆయన ఇంట్లోనే విచారణ చేసి కీలక విషయాలను, ఆధారాలను సేకరించినట్లు తెలిపింది. తాజాగా రామోజీరావుకు సంబంధించిన రూ.793 కోట్ల ఆస్తులను చార్జి షీట్ లో అటాచ్ చేసింది. దీని ద్వారా రామోజీరావుకు సంబంధించిన రూ.793 కోట్ల విలువైన ప్రాపర్టీని అటాచ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఏపీలో 37 బ్రాంచ్​ల ద్వారా మార్గదర్శి వ్యాపారం నిర్వహిస్తోందని, చిట్స్ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారని వివరించారు. ఖాతాదారులకు వెంటనే డబ్బు ఇచ్చే స్థితిలో మార్గదర్శి లేదని, మార్గదర్శి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్‌మెన్, ఆడిటర్లు కుట్రతో ఈ నేరానికి పాల్పడినట్లు ప్రకటించారు. ఏపీలో మార్గదర్శికి సంబంధించి 1989 చిట్స్ గ్రూపులు ఉన్నాయని, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూప్స్ ఉన్నాయని ఏపీ సీఐడీ అధికారులు వెల్లడించారు.