ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత.. టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీకీ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి జరిగినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. శాసనసభలో చర్చ జరుగుతుండగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు తెలిపారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోడియం వద్ద నిరసన తెలుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర సభ్యులు మీడియాకు వెల్లడించారు.