అడవిశ్రీరాంపూర్ లో రేషన్ బియ్యం అందక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
![అడవిశ్రీరాంపూర్ లో రేషన్ బియ్యం అందక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_651bcccc8569e.jpg)
ముద్ర, ముత్తారం: రేషన్ బియ్యం అందక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే వారికి బియ్యం అందించాలని అడవిశ్రీరాంపూర్ ఎంపిటిసి దొడ్ల గీత రాణి బాలాజీ మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ బండి రాజేశ్వరి కోరారు. స్పందించిన తాసిల్దార్ కమిషనర్ కు లేబర్ ద్వారా సమస్య తెలియజేసి వెంటనే పేదలకు బియ్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారని ఎంపీటీసీ తెలిపారు.