సిరిసిల్ల లో అప్పుల బాధతో నేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల లో అప్పుల బాధతో నేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల టౌన్, ముద్ర: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అప్పుల బాధతో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సిరిసిల్ల పట్టణం నెహ్రు నగర్ లో సిరిపురం అనిల్ ఇంట్లో అద్దెకు ఉంటున్న రాపెల్లి శ్రీనివాస్(38) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య రాపెల్లి సువర్ణ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.