నూతన ఆలయంలో ప్రతిష్టలు

నూతన ఆలయంలో ప్రతిష్టలు
  • యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టలు
  • 108 కలశములచే శిఖరాభిషేకం 

ముద్ర ,ఎల్లారెడ్డిపేట: 

 రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి  ఆలయంలో మూడవరోజు  శుక్రవారం తొగుట  రంగంపేట కు చెందిన  శ్రీ శ్రీ శ్రీ  పరమ హంస పరి వ్రాజకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ  మాధవా నంద సరస్వతీ  స్వాములవారి కర కమలములచే యంత్ర ప్రతిష్ట,విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, వైభవంగా జరిగింది.గర్తన్యాసం,  పూజ కళాన్యాసము , హావనం, పూర్ణహుతి , మహాకుంభాభిషేకం 108 కలశములచే శిరాభిషేకం  నిర్వహించారు.అనంతరం పాల్గొన్న భక్తకోటికి తీర్థ ప్రసాదములు మహాప్రసాద భోజన వసతి కల్పించారు.ఈ సందర్భంగా పాల్గొన్న భక్తకోటికి ఎల్లా రెడ్డి పేట మండల  ఆర్యవైశ్య సంఘం వారు తీర్థ ప్రసాద వితరణ భోజన వసతులు కల్పించారు.