ఉద్యోగం రాదేమోనని మనోవేదన తో సిరిసిల్ల యువకుడి బలవన్మరణం.

ఉద్యోగం రాదేమోనని మనోవేదన తో సిరిసిల్ల యువకుడి బలవన్మరణం.

ముద్ర సిరిసిల్ల టౌన్; ఐ యాం యూస్ లెస్... జాబ్ లెస్ అంటూ లెటర్ రాసి..
సిరిసిల్ల పట్టణం బి.వై.నగర్ కు చెందిన చిటికెన నాగభూషణం సుశీల దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు నవీన్ కుమార్ (30) హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇటీవల సాఫ్ట్ వేర్ వైపు వెళ్లే ప్రయత్నంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు,గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేదని మనస్తాపం తో శుక్రవారం ఇంట్లో తన గదిలో ఉరివేసుకుని మరణానికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన గ్రూప్ వన్ పేపర్ లీకేజీ వ్యవహారం కూడా తనని మానసికముగా దెబ్బ తీసింది అని నవీన్ దగ్గరి మిత్రులు తెలిపారు.