మత్స్య కారుల తెప్పలను కాల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

మత్స్య కారుల తెప్పలను కాల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

 ముద్ర, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నర్సింగాపూర్, విలాసాగర్, జగ్గారావుపల్లి గ్రామాలకు చెందిన 20 మంది మత్స్య కారుల తెప్పలను గుర్తు తెలియని వ్యక్తులు కాలపెట్టారు.రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య శాఖ ఛైర్మన్ చొప్పరీ రామచంద్రం, మరియు ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు రణావెని లక్ష్మణ్, జిల్లా డైరెక్టర్ బొజ్జ లక్ష్మిరాజం, మరియు మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్టల రమేష్, సంఘటన స్థలానికి చేరుకొని మత్స్య కారులను పరామర్శించడం జరిగింది. జిల్లా ఛైర్మన్ చొప్పరీ రామచంద్రం మాట్లాడుతూ: ఇట్టి విషయాన్ని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్, పిట్టల రవీందర్ ల దృష్టికి తీసుకువెళ్తనని హామీ ఇస్తూ, బోయినిపల్లి మండల పోలీస్ అధికారి ఎస్సై మహెందర్ ను కలిసి, దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.