కుల బందులు
- బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య
ముద్ర, ఎల్లారెడ్డిపేట :కులాల బంధు పేరును బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెరమీదకి తీసుకురావడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య శుక్రవారం ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు దళిత బంధు పేరిట పది లక్షల రూపాయలు కొంతమందికే ఇచ్చి మిగతా వారికి మొండి చేయి చూపడం జరిగిందన్నారు. అనంతరం బీసీ బంద్ పేరిట లక్ష రూపాయలు ఇస్తామని గ్రామానికి ఒక్కరికే పరిమితం చేయడం జరిగిందన్నారు. ఇది ఇలా ఉండగానే మైనార్టీ బందు పేరిట వారికి కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తామని తెరమీదకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రజలకు ఆదుకుంటే మంచిదే కానీ ఊరికి ఒక్కరికి ఇద్దరికీ ఇచ్చి మిగతా వారిని నిరాశ పరచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ఒక కులానికి బందు పేరిట డబ్బులు ఇస్తున్నట్లయితే కనీసం ఆ గ్రామంలో ఒక కులంలో 25 శాతం అన్న ఇస్తే బాగుంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరి ఇద్దరికి ఇచ్చి మిగతావారు ఇదే ఆశతో ఓట్లు వేస్తారని పొరపాటు పడుతున్నారని కానీ ఒక కులంలో నలుగురికి ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోగా అసంతృప్తితో వారు మీకు వ్యతిరేకంగా ఓటు వేసి మీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు పాల్గొన్నారు.