హుస్నాబాద్ లో మంత్రి.. కే టీ ఆర్ కు ఘన స్వాగతం
సిద్దిపేట, ముద్ర ప్రతి నిధి : వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొనడానికి రాష్ట్ర రాష్ట్ర ఐటీ పరిశ్రమలు పురపాలక పట్టణ అభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హుస్నాబాద్ కి వచ్చారు. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి సంతోష కుమార్ తో కలిసి హెలికాప్టర్లో వచ్చిన మంత్రికి ఇండోర్ స్టేడియం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ రమణ, పోలీస్ కమిషనర్ నేరేళ్లపల్లి శ్వేతా రెడ్డి , మున్సిపల్ చైర్మన్, పాలకవర్గం, కమిషనర్,సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది.