చెట్టుపై నుంచి పడి యువరైతు మృతి

చెట్టుపై నుంచి పడి యువరైతు మృతి

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:  తన పొలంలో ఉన్న మామిడి చెట్టు పై ఎక్కి కాయలు కోసేందుకు యత్నించిన ఓ యువ రైతు ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. జిల్లాలోని మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన బి.బాలరాజు(29) గురువారం ఉదయం తన పొలానికి వెళ్ళాడు. పొలంలో ఉన్న మామిడి చెట్టు ఎక్కగా ప్రమాద వశాత్తు కిందికి పడిపోయాడు.  దీంతో తీవ్ర గాయాలపాలవగా, స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.