దారూరి శేషాచారి మరణం పట్ల సంతాపం తెలిపిన మంత్రి జూపల్లి
ముద్ర.కొల్లాపూర్: కర్ణాటక సంగీత విద్వాంసులు దారూరి శేషాచారి మరణం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. కళారంగానికి శేషాచారి చేసిన సేవలను కొనియాడారు. ఆయన మరణం సంగీత ప్రియులకు తీరని లోటు అన్నారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శేషాచారి ఆత్మకు సద్గతులు కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు.