వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి..

వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి..

ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. పెట్ బషీరాబాద్ లో వీధి కుక్కతో దాడిలో బాలిక మృతి చెందింది. నిన్న వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రెండేళ్ల బాలిక దీపాళి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాద ఛాయలు నింపింది. రెండేళ్ల కూతురు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమే అని అక్కడి స్థానికులు ఫైర్ అవుతున్నారు.వీధి కుక్కలపై ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.