కాంగ్రెస్లోకి వెళతాననిఈటల ఎక్కడా అనలేదు
కాంగ్రెస్లోకి వెళతాననిఈటల రాజేందర్ ఎక్కడా అనలేదని నిజామాబాద్ బీజేపీ అర్వింద్ అన్నారు. దీనిపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేతలు ఏ పార్టీకి భవిష్యత్తు ఉంటుందో ఆ పార్టీలో చేరుతారని అన్నారు. భవిష్యత్తు ఉన్న నాయకులకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. పొంగులేటి, జూపల్లి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యారని, కాంగ్రెస్ నుంచి గెలిచినా మళ్ళీ వారు వేరే పార్టీలో చేరతారని అర్వింద్ చెప్పారు. తెలంగాణలో బీజేపీ తప్ప ప్రత్యామ్నాయం లేదని చెప్పారు.