Adani Hindenburg Controversy: అదానీ - హిండెన్బర్గ్ వివాదం: నిపుణుల కమిటీ ఏర్పాటు
![Adani Hindenburg Controversy: అదానీ - హిండెన్బర్గ్ వివాదం: నిపుణుల కమిటీ ఏర్పాటు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640042ea1f273.jpg)
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్ల పతనం వ్యవహారం, మోసం ఆరోపణలను పరిశీలించడానికి ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.
సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో సభ్యులుగా ఓపీ భట్, కేవీ కామత్, జస్టిస్ కేపీ దేవదత్, నందన్ నీలేకని, సోమశేఖర్ సుందరేశన్ ఉండనున్నారు. ఈ నిపుణుల కమిటీకి సెబీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మద్దతు ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది. కమిటీ పరిస్థితిని మొత్తంగా అంచనా వేస్తుందని, పెట్టుబడిదారులకు అవగాహన కల్పించే చర్యలను సూచిస్తుందని తెలిపింది.