ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అంబ‌టి రాయుడు సంచలన ట్వీట్‌...

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అంబ‌టి రాయుడు సంచలన ట్వీట్‌...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ-జనసేన -బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండటంపై మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు ఆనందం వ్యక్తం చేశాడు. ఏపీకి మంచి రోజులు వ‌చ్చాయ‌ని వ్యాఖ్యానించాడు. ఇది ప్ర‌జ‌ల విజ‌యం అని, ఈ అఖండ విజ‌యంలో నారా లోకేశ్ పాదయాత్ర కీల‌క పాత్ర పోషించింద‌ని చెప్పాడు.

‘ఇది ఏపీ ప్రజల గొప్ప విజయం. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ అఖండ విజయంలో నారా లోకేశ్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది’ అని ట్వీట్ చేశారు.