అయోధ్యలో బిజెపి ఓట‌మి...

అయోధ్యలో బిజెపి ఓట‌మి...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఉత్త‌ర ప్ర‌దేశ్ ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాది చేతిలో 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయోధ్య రామమందిరం ఫైజాబాద్ జిల్లాలోకే వస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఫైజాబాద్ అనే పిలిచేవారు. 2018 తర్వాతనే అయోధ్యగా పిలుస్తున్నారు. కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచీ బీజేపీ అభ్యర్థి వెనుకంచలోనే ఉన్నారు. మరోవైపు అవధేష్ ఆధిక్యంలో కొనసాగారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఫైజాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. అప్పుడే అవధేష్ గెలుస్తారని ఆయన అన్నారు.