బక్రీద్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
![బక్రీద్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_667135291a034.jpg)
ముద్ర,తెలంగాణ:- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ తదితరులకు అన్వర్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్ బక్రీద్ దావత్ ఇచ్చారు. పర్వదినం సందర్భంగా ముజాహిద్ ఆహ్వానం మేరకు సీఎం రేవంత్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, తదితరులు ముజాహిద్ ఇంట్లో విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముజాహిద్ కుటుంబ సభ్యులతోపాటు ప్రజలకు ముఖ్యమంత్రి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.