ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను సన్మానించిన ఎంపీపీ

ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను సన్మానించిన ఎంపీపీ

 గుండాల జూన్ 22 (ముద్ర న్యూస్) తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం,నాడు జిల్లాస్థాయి బెస్ట్ ప్రిన్సిపల్ గా అవార్డు వచ్చిన సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో,టి ఎస్ ఎం ఎస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే సురేష్ కుమార్ ను ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్, ప్రజా ప్రతినిధులు, అధికారు లు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా,వారు మాట్లాడుతూ.ఏ అధికారి అయిన పనిచేసే ప్రదేశంలో మంచి గుర్తింపు పొందాలని అలాంటి వారికే ఇలాంటి జిల్లాస్థాయి ఉత్తమ అవార్డులు ఉంటాయని ఇకముందు కూడా ఈ విధంగా పని చేస్తూ రాష్ట్రస్థాయిలో అవార్డు పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో,వైస్ ఎంపీపీ మహేశ్వరం మహేందర్ రెడ్డి, ఎంపిటిసి కుంచాల సుశీల అంజిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, మండల పంచాయతీ అధికారి పైళ్ల జనార్దన్ రెడ్డి, పంచాయతి రాజ్ ఏ ఈ దామోదర్, తదితరులు పాల్గొన్నారు.