కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ భార్య శివాని ప్రచారం 

కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ భార్య శివాని ప్రచారం 

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. మైనంపల్లి రోహిత్ కు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి శివాని గురువారం పట్టణంలోని 6,7,8 వార్డులలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిత్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు కొండన్ సురేందర్ గౌడ్, లల్లూ, మున్నా, న్యాయవాది జీవన్ రావు, అహ్మద్, మైసన్ లతో కలిసి ఇంటింటికి వెళ్లారు. ఈ సందర్భంగా మైనంపల్లి శివాని వార్డుల్లోని ప్రతి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయబోయే అభివృద్ధిపై అలాగే ఆరు గ్యారంటీలపై క్షుణ్ణంగా వివరించారు. పట్టణంలో కనీస అభివృద్ధి కూడా స్థానిక ఎమ్మెల్యే పద్మారెడ్డి చేసినట్టు కనిపిస్తలేదన్నారు. ఏ వార్డులో చూసిన మురికి కాల్వలు, రోడ్లు లేక వర్షాకాలంలో ఆ కాలనీ వాసులు పడుతున్న బాధలు ఆమెతో విన్నవించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నా భర్త మైనంపల్లి రోహిత్ ను మీరందరు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.