వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి.....

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి.....

ముద్ర ప్రతినిధి భువనగిరి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దిగవంత వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వైయస్సార్ విగ్రహానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహార్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలలో భాగమైన రైతులకు ఉచిత విద్యుత్.. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్. ప్రజల ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ లో భాగంగా 104. 108. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ల అమలుతో అనేక వర్గాల ప్రజల హృదయాలలో నేటికీ చిరంజీవిగా జీవించారని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ములుగు రాములు. పట్టణ అధ్యక్షులు సాయి నివాస్. మైనార్టీ అధ్యక్షులు వాహెద్. యువజన విభాగం కార్యదర్శి రాకేష్. నాయకులు నవీన్. లతీఫ్. నబీబ్. ఫాహిం. నసీం తో పాటు తదితరులు పాల్గొన్నారు..