దీన్ దయాల్ నగర్ ఇండ్లకు మరమ్మతులు చేపట్టాలి

దీన్ దయాల్ నగర్ ఇండ్లకు మరమ్మతులు చేపట్టాలి

 అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ముద్ర: అడిక్మెట్ డివిజన్ దీన్ దయాల్ నగర్ బస్తీలో పెచ్చులూడుతున్న ఇండ్లకు తక్షణమే మరమతులు చేపట్టాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం బస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు నిర్మించి చాలా కాలం అయ్యిందని, ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా స్లాబ్ పెచ్చులు ఊడుతున్నాయని బస్తీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను వెంటనే ఇండ్లకు మరమతులు చేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్ స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సురేందర్, నాయకులు ముఠా జైసింహ, శ్యాంసుందర్ చిట్టి, అస్లాం, ఖదీర్, రవి యాదవ్, నేత శీను, మాధవ్, మల్లికార్జున్ రెడ్డి, రింకు సింగ్, అబ్బో, శ్రీధర్ రెడ్డి, గురుదీప్ సింగ్, ఖలీల్, ప్రవీణ్, బషీర్, హిమైత్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.